శ్రీ విరుపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు

CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మకు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారి మూలవిరాట్కు పలు రకాల పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పసుపు, కుంకుమ, పుష్పమాలలతో అమ్మవారిని అలంకరించారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.