పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య
AKP: గొలుగొండ మండలం ఏ ఎల్ పురంలో విశాదం చోటుచేసుకుంది. జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న వింజరపు వీర వెంకట దుర్గా లక్ష్మి ఆత్మహత్య ఉదంతం అందరిలో విషాదం నింపింది. బాలిక ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన సూసైడ్ నోట్లో అమ్మానాన్న సారీ.. తమ్ముణ్ణి బాగా చూసుకోండి అని రాసింది. తనకు స్నేహితులందరూ ఇష్టమని తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది.