పెంచికల్ పేట్ సర్పంచ్గా ఉస్మాన్
ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో పెంచికల్ పేట్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి షేక్ ఉస్మాన్ విజయం సాధించారు. దీంతో పార్టీ కార్యకర్తలు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా షేక్ ఉస్మాన్ మాట్లాడుతూ.. గ్రామస్థులకు ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని పేర్కొన్నారు.