కరెంట్ షాక్‌తో గొర్రెల కాపరి మృతి

కరెంట్ షాక్‌తో గొర్రెల కాపరి మృతి

పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామ శివారులోని ఇటుక బట్టీ వద్ద శుక్రవారం కరెంట్ షాక్‌తో గొర్రెల కాపరి దాగేటి మల్లేష్ (35) మృతి చెందాడు. బట్టీ నిర్వాహకులు అక్రమంగా విద్యుత్ వాడుతూ భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. నేలపై పడి ఉన్న కరెంట్ వైర్లు గమనించని మల్లేష్ అక్కడికక్కడే మరణించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బట్టీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.