రోడ్డుకు మరమ్మతులు చేపట్టిన వీడీసీ సభ్యులు

NRML: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భైంసా మండలం పెండ్పల్లి గ్రామం నుంచి వానాల్పాడ్ గ్రామాలమధ్య రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెండ్పెల్లి గ్రామ వీడీసీ ఆధ్వర్యంలో గురువారం రోడ్డుకు మరమ్మతులు చేయించారు. రోడ్డుపై మొరంతో గుంతలను పూడ్చి బాగుచేయించారు.