బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడలోని శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయం బోనాల మొక్కులు చెల్లించుకునే భక్తులతో రద్దీగా మారింది. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం నైవేద్యం సమర్పించి తరిస్తున్నారు. క్యూలైన్లు, ప్రాంగణం భక్తులతో సందడిగా మారాయి. అమ్మవారికి నైవేద్యం, ఒడి బియ్యం, కల్లు సమర్పిస్తున్నారు.