ఆ రెండు రోజులు వలస కార్మికులకు సెలవు

ఆ రెండు రోజులు వలస కార్మికులకు సెలవు

కృష్ణా: తమిళనాడు, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆయా రాష్ట్రాల వలస కార్మికులకు ఏపీ ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఈ నెల 9న పుదుచ్చేరి, 23న తమిళనాడులో పోలింగ్ జరగనున్నందున కార్మికులు ఓటు వేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయవాడ లేబర్ డిప్యూటీ కమిషనర్ ధనలక్ష్మి తెలిపారు. అన్ని సంస్థలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.