ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

MBNR: గండేడ్ మండలం అంచన్ పల్లి ప్రాథమిక పాఠశాలను మండల ఎంఈవో రుద్రారం జనార్ధన్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా డైరీ రాయాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.