'ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరగాలి'
SKLM: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా, వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.