అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు..!
PPM: కొమరాడ మండలం కళ్లికోట గ్రామ సమీపంలోని నాగవళి నదీతీరంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులను ఇవ్వలేదు. అలాగే, అధికారికంగా ఇసుక ర్యాంపు కూడా లేదు. అయినా సరే రాత్రిపగలు తేడా లేకుండా ఇసుకను తవ్వుతున్నారు. ఒక్కోట్రాక్టర్ రూ.4వేల నుంచి రూ.5 వేలకు పట్టణాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం.