మాట నిలుపుకున్న ఎమ్మెల్యే జనార్దన్

ఒంగోలు మండలం కరవది దళితవాడ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నెరవేర్చారు. దళితవాడ పరమడ వైపు రూ.11.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.15 లక్షలతో స్మశానం వైపు గ్రావెల్ రోడ్డు, రూ.18 లక్షలతో చర్చి వీధిలో డ్రైనేజీ కాలువను నిర్మించారు. దళితవాడలోని నీటి సమస్య పరిష్కారానికి రూ.60 లక్షల నిధులు మంజూరు చేయించారు.