అధైర్యం కోల్పోకుండా విగ్రహం ఏర్పాటు: ఎంపీ
RR: మన్సురాబాద్ చంద్రపురి కాలనీలో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి ఎంపీ ఈటల రాజేందర్ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు వచ్చినా అధైర్యం కోల్పోకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. చత్రపతి శివాజీ జీవితం నాయకత్వానికి, ధైర్యానికి స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నారు.