VIDEO: అమలాపురం చేరిన పదో తరగతి ప్రశ్న పత్రాలు
కోనసీమ: ఈనెల 16వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం భారీ బందోబస్తు మధ్య ప్రశ్న పత్రాలు అమలాపురంకు చేరాయి. అమరావతి నుంచి వచ్చిన ఈ పత్రాలను ఎంఈవో దుర్గాదేవి ఆద్వర్యంలో తాలూకా, టౌన్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. 7 కేంద్రాలకు సంబంధించిన బండిల్స్ను పెట్టెలో పెట్టి షీల్ వేసి కస్టోడియన్ అధికారుల సమక్షంలో నిర్లిప్తం చేశారు.