'రాజ్యసభ స్థానం మాదిగలకు కేటాయించాలి'
SRPT: తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నేతలు డిమాండ్ చేశారు. సూర్యాపేట ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో నేతలు యాతాకుల రాజన్న, ఏపూరి రాజు మాట్లాడారు. రాజ్యసభ సీటు కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి పూర్తి బాధ్యత తీసుకోవాలని, తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు అన్నారు.