మర్రిపూడిలో భూముల రీ సర్వేపై అవగాహన ర్యాలీ

మర్రిపూడిలో భూముల రీ సర్వేపై అవగాహన ర్యాలీ

ప్రకాశం: మర్రిపూడిలో మంగళవారం భూముల రీ సర్వే ప్రాజెక్టులో భాగంగా అవగాహన ర్యాలీ తహసీల్దార్ జనార్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం నుంచి మండలంలో రీ సర్వే ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రీ సర్వే పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ వెంకటరెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.