నగునూర్ సర్పంచ్గా సాయిల్ల శ్రావణి విజయం
KNR: కరీంనగర్ రూరల్ మండలంలో గురువారం గ్రామ పంచాయతీ పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు జరిగింది. పోలింగ్ ముగియగానే ప్రారంభమైన కౌంటింగ్లో నగునూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా సాయిల్ల శ్రావణి విజయం సాధించారు. తనను నమ్మి, గెలిపించిన గ్రామ ప్రజలకు సాయిల్ల శ్రావణి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆమె విజయం పట్ల మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.