ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

SDPT: పనుల జాతర -2025 కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ మండలంలోని మీర్జాపుర్ గ్రామంలో రూ. 2 కోట్లతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆరోగ్య కేంద్రం లోపల కలియతిరిగారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు, సిబ్బందికి తెలిపారు.