వినతుల పరిష్కారానికి ప్రాధాన్యం: తహసీల్దార్
TPT: రెవెన్యూ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే వినతులను పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని సత్యవేడు నూతన తహసీల్దార్ శివప్రసాద్ తెలిపారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన, సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి సోమవారం వినతులను స్వీకరిస్తామని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు వినియోగించుకోవాలని సూచించారు.