'నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు'

'నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు'

జగిత్యాల కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదివారం రద్దు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులను స్వీకరించే ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కొనసాగుతుందన్నారు.