విశాఖలో CII సమ్మిట్కు 1000 వాహనాలు సిద్ధం
విశాఖలో జరగనున్న CII సమ్మిట్ జరగనుంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల రాకపోకల నిమిత్తం ప్రభుత్వం సుమారు 1000 వాహనాలను సిద్ధం చేసింది. ఈ వాహనాల కదలికను పోలీసులు, రవాణా, రెవెన్యూ అధికారులు నిరంతరం మానిటర్ చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వాహనాలు విశాఖకు చేరుకున్నాయి.