తిరుమలలో భక్తుల రద్దీ ఇలా

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్ మెంట్లు దాటి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు వేచి ఉన్నారు. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 77,043 మంది భక్తులు దర్శించుకోగా.. 41,859 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.