పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

యాదాద్రి: భువనగిరి మండలం నందనం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు ఎంత మంది ఉన్నారని, ఈ సంవత్సరం ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయని స్కూల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లీష్ పాఠాలు చదివించారు. సంఖ్య తక్కువగా ఉందని మళ్లీ గ్రామంలో 'బడిబాట' నిర్వహించి కొత్త విద్యార్థులు చేరేలా చూడాలన్నారు.