చీటీ డబ్బుల వివాదం.. వ్యక్తిపై దాడి
అన్నమయ్య: మదనపల్లెలో చీటీ డబ్బు వివాదం ఘర్షణకు దారితీసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సీటీఎం రోడ్డు శివాజీ నగర్లో నివసించే రెడ్డి ప్రసాద్ (24) తన తల్లిపై గొడవకు వచ్చిన వారిని అడ్డుకోగా, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.