BREAKING: రాష్ట్రంలో భూప్రకంపనలు
AP: విశాఖలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తిలో తెల్లవారుజామున 4.18 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. భీమిలి బీచ్ రోడ్లో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.