శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో అన్నదానం

VZM: విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా శనివారం అన్నవితరణ కార్యక్రమం చేపట్టినట్టు ఆలయ ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి తెలిపారు. ప్రతీ నెలలో వచ్చే మాస శివరాత్రికి ఇలా భోజనాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆలయ ఈఓ పద్మావతి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అన్నదానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.