స్వయంగా పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్
అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులు, వికలాంగులతో కలెక్టర్ ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.