దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం పర్యటించారు. 35 వార్డు వేలంపేట, 42 వార్డు ఇందిరానగర్ కాలనీ, తదితర ప్రాంతాల్లో సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 35 వార్డులో గృహ నిర్మాణాల సముదాయం సమస్య వెంటనే తీర్చాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు.