తిరుపతిలో నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల కలకలం
తిరుపతిలో నకిలీ మెడికల్ ఇన్వాలిడేషన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. తనపల్లికి చెందిన జయమ్మకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు ఆమె కుమారుడు చక్రపాణి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, తప్పుడు మార్గంలో ప్రభుత్వ ఉద్యోగం పొందారని చంద్రలేఖ అనే మహిళ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం చక్రపాణి తిరుచానూరులో రెవెన్యూ ప్రోటోకాల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.