పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి
E.G: నిడదవోలు(మం) డీ.ముప్పవరంలో ఉన్న ఎంపీపీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి, వారి అభ్యాసాన్ని తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.