పోలీస్ స్టేషన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

RR: షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట పోలీస్ స్టేషన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నరహరి, ఎస్సై రాజ కుమార్ పోలీస్ స్టేషన్ ఆవరణలో త్రివర్ణ జెండా ఎగరవేసి జాతీయగీతం ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనందరికీ స్వేచ్ఛ వాయువులు ప్రసాదించిన శుభదినమే స్వాతంత్య్ర దినోత్సవం అన్నారు.