ఏనుగుల దాడి.. అటవీ సిబ్బందికి గాయాలు

AP: తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బోయపల్లి వద్ద అటవీశాఖ సిబ్బందిపై గజరాజులు దాడి చేశాయి. ఈ ఘటనలో ఎలిఫెంట్ టాస్క్ఫోర్స్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, యలమంద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.