డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 11 మందిపై కేసులు నమోదు
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలో పోలీసులు విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద DSP రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో భారీ వాహనాల డ్రైవర్లకు బ్రెతలైజర్ పరీక్షలు చేశారు. మొత్తం 3,150 మంది డ్రైవర్లను తనిఖీ చేయగా, 11 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు.