VIDEO: రోడ్డు భద్రత ఒక సామాజిక ఉద్యమం: ఎస్పీ నరసింహ
SRPT: ‘అరైవ్ - ఎలైవ్’ నిరంతర ప్రక్రియని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం రోడ్డు భద్రతా మాసోత్సవంలో ఆయన మాట్లాడారు. గతేడాది జిల్లాలో ప్రమాదాల వల్ల 274 మంది మరణించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు విధిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని.. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.