సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి టీడీపీ కార్యాలయంలో ఉయ్యూరు టౌన్కు చెందిన 32 మందికి రూ.28.36 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవారికి అండగా ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నారని, గత ఏడాది రూ.7.14 కోట్లు సహాయం చేసినందుకు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.