కేఎంసీ కమిషనర్కు ఉత్తమ పురస్కారం

KMM: మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించినందుకు అవార్డు అందజేశారు.