ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

NDL: పాణ్యంలోని పలు హోటళ్లను జిల్లా ఆహార భద్రత అధికారులు మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఇటీవలి కాలంలో ఫిర్యాదులు వస్తుండటంతో ఆకస్మికంగా దాడులు నిర్వహించి, పలు హోటళ్లలో శాంపిల్స్‌ని సేకరించారు. ఫ్రిజ్‌లలో రోజుల తరబడి నాన్ వెజ్‌ను స్టాక్ ఉంచి, వంటకాలు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.