కొమురవెల్లి మల్లన్న ఆదాయం

SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. స్వామి వారికి 48 రోజుల్లో రూ.90,09,170 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎస్.అన్నపూర్ణ తెలిపారు. 96 గ్రాముల మిశ్రమ బంగారం, 9.50 కిలోల మిశ్రమ వెండి, 22 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 14 క్వింటాలు వచ్చాయన్నారు.