నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న విప్

JGL: ధర్మపురి మండలం రాజారాం గ్రామంలో బుధవారం జరుగుతున్న నల్ల పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్ కు ఆలయ పక్షాన ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ఇటీవల వేయించిన బోరూరు ప్రారంభించారు.