కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా

కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా

కర్నూలు: మధ్యాహ్న భోజన కార్మికులు స్కూల్ స్కావెంజర్లు, నైట్ వాచ్‌మెన్‌లకు వేతనాలు పెంచి, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేసి, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు వినతిపత్రం అందించారు.