కిక్ బాక్సింగ్ విజేతకు మంత్రి సుభాష్ అభినందనలు
కోనసీమ: న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలలో సత్తా చాటిన ద్రాక్షారామ విద్యార్ది కె.విష్ణు వర్ధన్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. ఏడవ తరగతి చదువుతున్న విష్ణువర్ధన్ ఒక స్వర్ణ, ఒక రజిత పథకాన్ని సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి విద్యార్థికి రూ.5 వేలు నగదు అందజేశారు.