'30 లోపు పంట వివరాలు ఆన్ లైన్లో నమోదు చేయాలి'

SRD: వ్యవసాయ రైతులు పంటల వివరాలను 30వ తేదీలోగా ఆన్ లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ శనివారం తెలిపారు. ఆన్ లైన్లో నమోదు చేసుకుంటేనే సీసీఐలో అమ్మడానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందన్నారు. రైతులందరూ తమ పట్టా పాసు బుక్ను తీసుకొని ఆయా క్లస్టర్ల ఏఈలను కలవాలని కోరారు.