దివ్యాంగులు, వృద్ధులకు కమిషనర్ ముఖ్య గమనిక

దివ్యాంగులు, వృద్ధులకు కమిషనర్ ముఖ్య గమనిక

TPT: దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల గుర్తింపు శిబిరం ఈనెల 16న నిర్వహించనున్నట్లు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తెలిపారు. ఎస్పీజేఎన్ఎం స్కూల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం జరుగుతుంది. వీల్ ఛైర్లు, వాకర్లు, వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు తదితర పరికరాలకు అర్హులను గుర్తిస్తారు. అవసరమైన పత్రాలతో హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు.