పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే పంపిణీ

పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే పంపిణీ

E.G: మార్చి నెల ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే అందజేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే, ఈసారి మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారుల సౌకర్యార్థం శనివారం నాడే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ శుక్రవారం వెల్లడించారు.