గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఏదో గుర్తు తెలియని వాహనం అతని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.