తాగునీటి పంప్ హౌస్‌లను పరిశీలించిన కమిషనర్

తాగునీటి పంప్ హౌస్‌లను పరిశీలించిన కమిషనర్

GNTR: ప్రజా ఆరోగ్యం దృష్ట్యా MTMC కమిషనర్ అలీమ్ బాషా మంగళవారం నగరంలోని తాగునీటి పంప్ హౌస్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైప్‌లైన్ లీకేజీలను వెంటనే అరికట్టాలని సిబ్బందిని ఆదేశించారు. నీటి నాణ్యతను పరీక్షించేందుకు నమూనాలను గుంటూరు ల్యాబ్‌కు పంపాలని సూచించారు. తాగునీటిలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు వెంటనే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.