పాము కాటుతో వ్యక్తి మృతి

పాము కాటుతో వ్యక్తి మృతి

ELR: లింగపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన సరిపల్లి ఏసుపాదం(48) కూలి పనులు చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. గురువారం స్థానిక పామాయిల్ తోటలో గెలలు కోస్తున్న సమయంలో పాముకాటుకు గురయ్యాడు. గమనించిన తోటి కూలీలు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతని మృతి చెందినట్లు ధ్రువీకరించారు.