ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
NDL: ప్యాపిలిలోని ఆర్&బీ అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. స్థానికుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అర్జీలకు చట్టపరంగా పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.