మున్సిపల్ కమిషనర్ సహా ఏడుగురిపై విచారణకు ఆదేశం..!

మున్సిపల్ కమిషనర్ సహా ఏడుగురిపై విచారణకు ఆదేశం..!

W.G: భీమవరం మున్సిపాలిటీలో నిధులు, అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. కమిషనర్ శ్యామలతో పాటు మరో ఆరుగురు అధికారులపై విచారణ జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణకు అధికారులుగా ఆర్డీ నాగనరసింహారావు, ప్రస్తుత కమిషనర్ రామచంద్రారెడ్డిలను ప్రభుత్వం నియమించింది. 2 నెలల్లోగా సమగ్ర విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోరింది.