మణిపూర్లో మరో కీలక పరిణామం

మణిపూర్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన 23 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మరోసారి భేటీ అయ్యారు. వీరంతా మాజీ మంత్రి తొంగమ్ బిశ్వజిత్ సింగ్ నివాసంలో సమావేశమై నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో సాధారణ స్థితిని తీసుకురావటమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు వెల్లడించాయి.