రైలు కిందపడి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి

రైలు కిందపడి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి

అన్నమయ్య: ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం నంద్యాల ప్యాసింజర్ రైలును ఎక్కే ప్రయత్నంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రెడ్డయ ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి రైలు కిందపడ్డ అతడిని సురక్షితంగా బయటికి తీశారు. గాయపడిన విద్యార్థిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.